రాష్ట్ర ఏర్పాటు తర్వాత అసెంబ్లీ సమావేశాలు విధానపరంగా జరుగుతున్నాయన్న రాములమ్మ

రాష్ట్ర ఏర్పాటు తర్వాత అసెంబ్లీ సమావేశాలు విధానపరంగా జరుగుతున్నాయన్న రాములమ్మ

రాష్ట్ర ఏర్పాటు తర్వాత అసెంబ్లీ సమావేశాలు విధానపరంగా జరుగుతున్నాయన్న రాములమ్మ

అసెంబ్లీ సమావేశాలు విధానపరంగా జరగడం రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇదే తొలిసారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. 2014 తర్వాత సమావేశాలు ఇంత సాఫీగా, హుందాగా జరుగుతుండగా చూశానని పేర్కొన్నారు. సచివాలయం కూడా ఇప్పుడు పూర్థిస్థాయిలో పనిచేస్తోందని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దాదాపు దశాబ్దం తర్వాత ప్రజాస్వామ్య పంథాలో ప్రభుత్వం నడుస్తున్నదని పేర్కొన్నారు.

ఇది ప్రజా ప్రభుత్వమని, అది ప్రజాస్వామ్య పంథాలో నడుస్తున్నదని కోట్లాదిమంది ప్రజలకు ఇప్పుడిప్పుడే విశ్వాసం ఏర్పడుతోందని తెలిపారు. 26 సంవత్సరాల పోరాటం తర్వాత మీ రాములమ్మ ఇప్పుడు ఏం చేయాలని ఎవరైనా తనను అడిగితే.. తెలంగాణ ప్రజలకు కాలం మేలు చేయాలని, ఈ భూమి బిడ్డల భవిష్యత్తు ఎప్పటికీ మంచిగా ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటానని చెబుతూ విజయశాంతి ఎక్స్ ద్వారా తెలిపారు.

మాకు ఉచితం వద్దు.. టికెట్ తీసుకునే వెళ్తాం.. ఖమ్మం మహిళా టీచర్ల

 తీర్మానం

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కల్పించిన ఉచిత ప్రయాణాన్ని తాము ఉపయోగించుకోబోమని, తాము టికెట్ తీసుకునే ప్రయాణిస్తామని ఖమ్మం జిల్లా మహిళా ఉపాధ్యాయులు తేల్చి చెప్పారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పేదలు ఉపయోగించుకుంటే చాలని, అది వారికి అవసరం కూడా అని వారు పేర్కొన్నారు. తమకు టికెట్ తీసుకుని ప్రయాణంచేంత ఆర్థిక స్వేచ్ఛ ఉందని తెలిపారు. ఈ మేరకు అందరూ కలిసి ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోకూడదని తీర్మానం చేసుకున్నారు.

ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులు ఈ మేరకు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని కాలేజీ విద్యార్థులు, పేదలు, వృద్ధులకు వదిలేయాలని నిర్ణయించారు. తమ నిర్ణయం వల్ల ఆర్టీసీకి అండగా ఉన్నామన్న తృప్తితోపాటు ఆటో కార్మికులకు ఉపాధి లభిస్తుందన్న సంతృప్తి లభిస్తుందని పేర్కొన్నారు. వీరు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే, బస్సుల్లో వీరికి డబ్బులు తీసుకుని టికెట్ ఇస్తారా? లేదా? అన్న అనుమానాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు.