నియోజకవర్గం మారాలంటే బాధగానే ఉంటుందన్న వెల్లంపల్లి

నియోజకవర్గం మారాలంటే బాధగానే ఉంటుందన్న వెల్లంపల్లి

నియోజకవర్గం మారాలంటే బాధగానే ఉంటుందన్న వెల్లంపల్లి

తాము గేట్లు తెరిస్తే వైసీపీలో ఉన్న వాళ్లంతా టీడీపీలోకి వస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారని... మరి ఇంతవరకు ఆయన గేట్లు ఎందుకు తెరవలేదని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. తన నియోజకవర్గాన్ని విజయవాడ సెంట్రల్ కు మార్చడంపై స్పందిస్తూ... నియోజకవర్గం మారాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుందని... కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. మల్లాది విష్ణుతో కలిసి విజయవాడ సెంట్రల్ లో వైసీపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ వెస్ట్ లో మైనార్టీ అభ్యర్థిని పెట్టాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని, అందుకే తనను సెంట్రల్ కు మార్చారని చెప్పారు. వెల్లంపల్లి వర్గం, మల్లాది వర్గం అని వేర్వేరు వర్గాలు ఉండవని... అంతా వైసీపీ వర్గమేనని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనేది వైఎస్ షర్మిల ఇష్టమని... ఆమె ఏం మాట్లాడతారో వేచి చూడాల్సి ఉందని అన్నారు.

  • షర్మిల కాంగ్రెస్ లో చేరడం వల్ల తమకేమీ ఇబ్బంది లేదన్న కొడాలి నాని

వైఎస్సార్టీపీ చరిత్ర ముగిసింది. పార్టీ ఏర్పడిన కొన్నేళ్లకే జాతీయ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైపోయింది. ఇవాళ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ లో చేరడం తెలిసిందే. కాగా, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికరంగా స్పందించారు.

షర్మిల కాంగ్రెస్ లో చేరడం వల్ల వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైసీపీ ఓట్లు ఎందుకు చీలతాయి? అలాంటప్పుడు పురందేశ్వరి బీజేపీలో చేరితే టీడీపీ ఓట్లు చీలవా? అంటూ లాజిక్ ను ప్రదర్శించారు. ఏపీలో కాంగ్రెస్ కు ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేదని కొడాలి నాని స్పష్టం చేశారు. వైసీపీకి పనికిరానివాళ్లంతా టీడీపీకి పనికివస్తారని ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణ పరిస్థితికి దిగజారడానికి రెండు కారణాలు ఉన్నాయని తెలిపారు. "ఒకటి... రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీని గాలికి వదిలేశారు.... రెండోది, రాష్ట్రంలో చనిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని చనిపోయాక ముద్దాయిగా చేశారు... ఆయన కుటుంబంలోని జగన్ మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టారు. ఈ రెండు కారణాలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దిక్కుమాలిన పరిస్థిని ఎదుర్కొంటోంది" అని విమర్శించారు. ఈ రెండు కారణాలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జగన్ కు క్షమాపణలు చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.

వైఎస్సార్టీపీ చరిత్ర ముగిసింది. పార్టీ ఏర్పడిన కొన్నేళ్లకే జాతీయ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైపోయింది. ఇవాళ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ లో చేరడం తెలిసిందే. కాగా, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికరంగా స్పందించారు.

షర్మిల కాంగ్రెస్ లో చేరడం వల్ల వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైసీపీ ఓట్లు ఎందుకు చీలతాయి? అలాంటప్పుడు పురందేశ్వరి బీజేపీలో చేరితే టీడీపీ ఓట్లు చీలవా? అంటూ లాజిక్ ను ప్రదర్శించారు. ఏపీలో కాంగ్రెస్ కు ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేదని కొడాలి నాని స్పష్టం చేశారు. వైసీపీకి పనికిరానివాళ్లంతా టీడీపీకి పనికివస్తారని ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణ పరిస్థితికి దిగజారడానికి రెండు కారణాలు ఉన్నాయని తెలిపారు. "ఒకటి... రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీని గాలికి వదిలేశారు.... రెండోది, రాష్ట్రంలో చనిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని చనిపోయాక ముద్దాయిగా చేశారు... ఆయన కుటుంబంలోని జగన్ మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టారు. ఈ రెండు కారణాలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దిక్కుమాలిన పరిస్థిని ఎదుర్కొంటోంది" అని విమర్శించారు. ఈ రెండు కారణాలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జగన్ కు క్షమాపణలు చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.