సిట్టింగ్ ఎంపీలకు అమిత్ షా పచ్చజెండా...

సిట్టింగ్ ఎంపీలకు అమిత్ షా పచ్చజెండా...

సిట్టింగ్ ఎంపీలకు అమిత్ షా పచ్చజెండా...

తెలంగాణలో నలుగురు సిట్టింగ్ ఎంపీలు... రానున్న లోక్ సభ ఎన్నికల్లో అవే స్థానాల నుంచి చేసేందుకు బీజేపీ అగ్రనేత అమిత్ షా పచ్చజెండా ఊపారు. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న అమిత్ షా అక్కడి నుంచి నేరుగా నోవాటెల్ హోటల్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్ సభ ఎన్నికలపై చర్చించారు. నలుగురు ఎంపీలకు తిరిగి టిక్కెట్లు ఇస్తామని చెప్పిన అమిత్ షా... మిగతా 13 లోక్ సభ స్థానాల పరిస్థితిపై ఆరా తీశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల మధ్య గ్యాప్ దెబ్బతీసిందని, ఇది లోక్ సభ ఎన్నికల్లో రిపీట్ కావొద్దని నేతలకు హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూ వెళ్ళి పార్టీకి నష్టం చేయవద్దని హితవు పలికారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన భాగ్యలక్ష్మి దేవాలయంకు బయలుదేరారు.

కాగా తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, అదిలాబాద్ నుంచి సోయం బాపురావు గత లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ స్థానాల నుంచి తిరిగి వీరే పోటీ చేయనున్నారు.

రేవంత్ రెడ్డిపై బీజేపీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసింది. కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ మాట్లాడుతూ... తాను కాన్వాయ్‌తో వెళ్లే సమయంలో నిబంధనల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని... ఎక్కువసేపు ట్రాఫిక్‌ను నిలుపువద్దని.. తాను బయలుదేరే కొద్ది సమయం ముందు ఆపితే చాలని అధికారులకు సూచించారు. మరో సందర్భంలో... తెలంగాణకు అప్పులు ఉన్నాయని.. ప్రకటనలకు ఎక్కువగా ఖర్చులు చేయవద్దని అధికారులకు సూచించారు.

అయితే వీటికి భిన్నంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనిపిస్తోందని బీజేపీ పేర్కొంది. ఇందుకు సంబంధించి ఓ ట్వీట్ చేసింది. చెప్పేవి శ్రీరంగ నీతులు... చేసేవి పనికిమాలిన పనులు అని పేర్కొంది.

ఆర్భాటాలు వద్దు.. ప్రజలకు అసౌకర్యం కలిగించవద్దని సీఎం రేవంత్ చెప్పారని.. కానీ భారీ కాన్వాయ్‌తో రేవంత్ రెడ్డి వెళ్తుండగా ట్రాఫిక్ జామ్‌తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఫోటోను బీజేపీ షేర్ చేసింది. 

ప్రభుత్వం అప్పుల్లో ఉంది.. అనవసర ఖర్చులు వద్దని రేవంత్ రెడ్డి చెప్పారని... కానీ పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చిందని ఇందుకు సంబంధించి వివిధ పత్రికల్లో ఇచ్చిన యాడ్స్ ఫోటోలను పేర్కొంది.