రెండో భార్యకు భరణం ఇవ్వాల్సిందే ‌‌

రెండో భార్యకు భరణం ఇవ్వాల్సిందే ‌‌

రెండో భార్యకు భరణం ఇవ్వాల్సిందే ‌‌

ఇద్దరు భార్యలున్నప్పుడు ... ఏదైన మనస్పర్దల కారణంగా విడిపోవాల్సి వచ్చినప్పుడు రెండో భార్య కూడా భరణం ఇవ్వాలని బాంబే హూకోర్టు తీర్పునిచ్చింది.   అంతే కాదు నెలవారీ  ఇచ్చే భరణాన్ని పెంచేందుకు పిటిషన్​ దాఖలు చేసుకొనే అవకాశం కూడా రెండో భార్యకు ఉంటుందని బాంబై హైకోర్టు తెలిపింది. 

నాశిక్​ జిల్లా యోలా ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ 2015 లో ఓ మహిళకు ( రెండో భార్య) తన భర్త ఆదాయాన్ని పరిశీలించి.. ఆమెకు రూ, 2,500 భరణాన్ని ఇవ్వాలని తీర్పు నిచ్చారు.  ఆ వ్యక్తి నిఫాద్​ లోని సెషన్స్ కోర్టులో అప్పీల్​ చేశారు.  ఆ తరువాత ఏప్రిల్​ 2022 లో సెషన్స్​ కోర్టు  కింది కోర్టు ఉత్తర్వులు రద్దు చేసింది.  సెషన్స్​ కోర్టు ఉత్తర్వులపై ఆమహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.   తనకు 1989లో వివాహం అయిందని.. తమ దాంపత్య జీవితంలో 1991లో మగ బిడ్డను ప్రసవించానని తెలిపింది.  అంతకు ముందే నా భర్తకు వివాహం అయిందని.. అయితే మొదటి భార్యకు సంతానం కలగనందున చట్టపరంగా విడిపోయామని చెప్పి తనను నమ్మించడంతో  వివాహం అయిన వ్యక్తిని పెళ్లి చేసుకొనేందుకు అంగీకరించినట్లు పిటిషన్​ లో తెలిపింది. 

తనకు పెళ్లయిన రెండేళ్లకు మధ్య వర్తుల జోక్యంతో తన భర్త మొదటి భార్యతో సహజీనవం ప్రారంభించారని.. అప్పుడు ( మొదటి భార్యకు) ఒక కొడుకు పుట్టాడని పిటిషన్​లో తెలిపింది.  తరువాత తనకు కూడా మరల ఇంకొక కుమారుడు కలిగాడని.. పాఠశాల రికార్డులలో ఆ వ్యక్తి పేరునే తండ్రి పేరుగా నమోదు చేయించినట్లు పేర్కొంది. రెండో కుమారుడు పుట్టిన తరువాత  ఆ తరువాత మరస్పర్దలు వచ్చాయని తెలిపింది. 2011 వరకు కోర్టు ఉత్తర్వలు భరణం పొందానని తరువాత మొదటి భార్య ప్రోద్భలంతో భరణవ ఇవ్వడం ఆపేశాడని బాధితులు రాలు హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది.  ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు సెషన్స్​కోర్టు ఉత్తర్వులను రద్దుచేసి.. తొమ్మదేళ్లుగా చెల్లించాల్సిన బకాయిలను రెండు నెలలలోగా   క్లియర్​ చేయాలని..  రెండో భార్యకు భరణం ఇవ్వాలని ఆదేశాలు  జారీ చేస్తే.. భరణం పెంచేందుకు మళ్లీ పిటిషన్​  దాఖలు చేసుకొనే అవకాశం కూడా రెండో భార్యకు బాంబే హైకోర్టు కల్పించింది.