బీఆర్ఎస్ నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను తిరస్కరించిన గవర్నర్...

బీఆర్ఎస్ నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను తిరస్కరించిన గవర్నర్...

బీఆర్ఎస్ నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను తిరస్కరించిన గవర్నర్...

గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. కానీ ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను గవర్నర్ తిరస్కరించారు. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. శ్రవణ్, సత్యనారాయణలను హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గత జులైలో కేబినెట్ తీర్మానం చేసింది. కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గత ఏడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. అయితే గవర్నర్ పరిధి దాటి వ్యవహరించారని.. కేబినెట్‌కు ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు పేర్కొంటూ హైకోర్టుకు వెళ్లారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టనుంది.

కాంగ్రెస్ 420 హామీల పేరుతో బీఆర్ఎస్ బుక్‌లెట్ విడుదల

కాంగ్రెస్ 420 హామీల పేరుతో బీఆర్ఎస్ బుధవారం బుక్ లెట్‌ను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇష్టారీతిన హామీలు ఇచ్చి.. వాటిని అమలు చేసే పరిస్థితి లేదని విమర్శించింది. అందుకే హామీల అమలును ఈ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని పేర్కొంది. కాంగ్రెస్ ప్రభుత్వం తన మాటకు కట్టుబడి లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే ఆరు గ్యారెంటీలతో పాటు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన స్వేదపత్రం ప్రతులను ఈ సందర్భంగా పార్టీ నేతలకు అందించింది. కేసీఆర్ ఈ పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని వివరించింది. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఒత్తిడి చేసేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. హామీల అమలులో ఆలస్యం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని భావిస్తోంది.