చంద్రబాబు ముందస్తు బెయిల్ పరిశీలించి తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు

చంద్రబాబు ముందస్తు బెయిల్ పరిశీలించి తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు

చంద్రబాబు ముందస్తు బెయిల్ పరిశీలించి తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దాన్ని అనుసంధానించే ఇతర రోడ్ల అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుతో ఏపీ సీఐడీ చంద్రబాబు సహా పలువురిపై కేసు నమోదు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబును ఏ1 గా పేర్కొంటూ విచారణ చేపట్టింది.

ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు సెప్టెంబర్ లో హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. శుక్రవారం ఏపీ సీఐడీ, చంద్రబాబు తరఫు లాయర్లు సమర్పించిన లిఖితపూర్వక వాదనలు పరిశీలించింది. శనివారం తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది.

తల్లిని చూసేందుకు వస్తే అరెస్ట్ చేస్తారా?: దేవినేని ఉమా,

 ప్రత్తిపాటి పుల్లారావు

టీడీపీ ఎన్నారై యశ్ ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి, టీడీపీ నేత ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసేందుకు వచ్చిన యశ్ ను అరెస్ట్ చేశారని చెప్పారు. 70 ఏళ్ల వయసున్న ఆయన తల్లి ఎంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇలా అరెస్ట్ చేయడం దారుణమని చెప్పారు. యశ్ ను అరెస్ట్ చేయడం ద్వారా లక్షలాది మంది తెలుగు ఎన్నారైలకు జగన్ రెడ్డి ఏం సందేశం ఇస్తున్నారని ఉమా ప్రశ్నించారు. 

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సీఐడీ పోలీసుల తీరు దారుణంగా ఉందని విమర్శించారు. సీఐడీ అధికారులు వైసీపీకి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారా? అని ఆయన మండిపడ్డారు. 41ఏ నోటీసులు ఇవ్వాలని కోర్టులు పదేపదే చెపుతున్నా సీఐడీకి పట్టదా? అని ప్రశ్నించారు.