25న పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొననున్న సీఎం

25న పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొననున్న సీఎం

25న పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొననున్న సీఎం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మూడు రోజుల పర్యటనకు గాను కడపకు చేరుకున్నారు. కడప ఎయిర్ పోర్టులో జగన్ కు వైసీపీ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ లో గోపవరంకు సీఎం బయల్దేరారు. సెంచురీ పరిశ్రమలో ఎండీఎఫ్, హెచ్పీఎల్ ప్లాంట్లను ప్రారంభించనున్నారు. అనంతరం కడప రిమ్స్ ఆసుపత్రి వద్ద డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తారు. రాత్రికి ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. 

రేపు వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళి అర్పిస్తారు. అనంతరం అక్కడ ప్రేయర్ హాల్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. తర్వాత సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ చేరుకుని పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 25వ తేదీ ఉదయం పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.

  • టీడీపీ-జనసేన పొత్తుపై పేర్ని నాని సెటైర్లు

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ-జనసేన పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

పొత్తులో భాగంగా జనసేనకు 25 సీట్లు ఇస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారని నాని అన్నారు. టీడీపీ 150 సీట్లలో పోటీ చేస్తే, మిగిలిన 25 సీట్లు జనసేనకు ఇస్తున్నారని వివరించారు. జనసేనకు ఇచ్చే ఆ 25 సీట్లలోనూ సగం స్థానాలకు తామే అభ్యర్థులను ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ నేతలు 'ఆఫ్ ద రికార్డ్' చెబుతున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. 

జనసేన తగినంతమంది అభ్యర్థులను కూడా నిలబెట్టలేని స్థితిలో ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారని తెలిపారు. "ఇదీ... జనసేన గురించి తెలుగుదేశం పార్టీ వారికి ఉన్న గొప్ప అభిప్రాయం. మేం సరాసరి వైసీపీ పార్టీ సభ్యత్వం తీసుకుని దమ్ము ధైర్యంతో చెప్పుకోగలుతున్నాం. వాళ్లు... పవన్ కల్యాణ్, మిగతా వాళ్లు అందరూ తెలుగుదేశమే! కాకపోతే వేషాలు వేసుకుంటూ, తలొక పార్టీ అంటూ మెడలో బోర్డు వేసుకుని ఎన్నికల బరిలో దిగుతున్నారు. మాదొక యువగళం, మాదొక నవశకం, మాదొక ముసలి శకం అని చెప్పుకుంటున్నారు. చెప్పేదేంటంటే... చంద్రబాబు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని పవన్ కల్యాణ్ 2014 నుంచి తీవ్రంగా కృషి చేస్తున్నాడు" అని పేర్ని నాని వివరించారు.