చంద్రబాబుకు ఎన్నికల భయం పట్టుకుంది .. పెద్దిరెడ్డిరెడ్డి

చంద్రబాబుకు ఎన్నికల భయం పట్టుకుంది .. పెద్దిరెడ్డిరెడ్డి

చంద్రబాబుకు ఎన్నికల భయం పట్టుకుంది .. పెద్దిరెడ్డిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబును ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలిసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ... చంద్రబాబుకు ఎన్నికల భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిశోర్ ను తాము వదిలేసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు పట్టుకున్నారని అన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని... ప్రశాంత్ కిశోర్ కూడా చేసేదేమీ లేదని చెప్పారు. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాలకు ఎల్లో మీడియా అండగా ఉందని విమర్శించారు. గత ఎన్నికల కంటే ఈసారి వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. జగన్ సంక్షేమ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.

  • వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అంబటి రాంబాబు

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వంగవీంటి రంగాను చంపింది నాటి టీడీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. దాంతో, ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పట్టుబట్టి, కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకువచ్చారని వెల్లడించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరు నేతలు మారడం, మళ్లీ ఎన్టీఆర్ అధికారంలోకి రావడం జరిగిందని అంబటి రాంబాబు వివరించారు.

అప్పట్లో తాను తొలిసారిగా కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచానని, మళ్లీ 2019లో ఎమ్మెల్యేగా గెలిచానని, ఈ మధ్యలో ఖాళీగానే ఉన్నానని తెలిపారు. ఇప్పుడు తనపై పోటీ చేస్తున్న నేత (కన్నా) కూడా గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారని వెల్లడించారు. 

"వంగవీటి రంగాను చంపింది టీడీపీయేనని అతడు అనేక సందర్భాల్లో అన్నాడు. అసలు, రంగాను చంపింది చంద్రబాబేనని డైరెక్ట్ గా అన్నాడు. రంగాను చంపడమే కాకుండా, తనను కూడా చంపాలని ప్రయత్నించాడని ఆ నేత చెప్పాడు.  రంగా గారిని చంపగలిగాడు కానీ, నన్ను చంపలేకపోయాడు అని ఆ నేత చెప్పాడు. ఇవాళ ఏం జరుగుతోంది రాజకీయాల్లో? పదవే శాశ్వతమా? పదవి కోసం పాకులాడడమే ముఖ్యమా? పదవి కోసం పాకులాడేవాడ్ని సమాజం క్షమించదు. 

నేను గతంలో కాంగ్రెస్ లో ఉన్నాను. వైఎస్ చనిపోగానే జగన్ వెంట నడిచాను. పదవి కోసమే నడిచానా? ఆ రోజు జగన్ సీఎం అవుతారని ఎవరైనా ఊహించారా? నమ్ముకున్న సిద్ధాంతం కోసం, ప్రేమ కోసం, అభిమానం కోసం, మాట కోసం పనిచేస్తుంటే పదవులు వస్తాయి, పోతాయి... అది వేరే విషయం" అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.