'గోకుల్ చాట్' యజమాని ముకుంద్ దాస్ మృతి

'గోకుల్ చాట్' యజమాని ముకుంద్ దాస్ మృతి

'గోకుల్ చాట్' యజమాని ముకుంద్ దాస్ మృతి

హైదరాబాద్‌లో ‘గోకుల్ చాట్’ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో! కోఠి సందర్శించిన వారు ఇక్కడ చాట్ తినకుండా వెళ్లలేరు. అంతగా ఫేమస్ అయిన ఈ గోకుల్ చాట్ పేరు 2007లో దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది. కారణం అక్కడ జరిగిన బాంబుదాడే. ఆ ఏడాది ఆగస్టు 25న ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాంబు పేలింది. చాట్ తింటూ ముచ్చట్లాడుకుంటున్న 33 మంది ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వారిలో స్నేహితులు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది. 

తాజాగా, గోకుల్ చాట్ పేరు మరోమారు వార్తల్లోకి ఎక్కింది. దాని యజమాని ముకుంద్ దాస్ నిన్న మృతి చెందారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కాచిగూడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోకుల్‌ చాట్‌ను ఆయన 1996లో ప్రారంభించారు.