మేడారానికి పోటెత్తిన భక్తులు

మేడారానికి పోటెత్తిన భక్తులు

మేడారానికి పోటెత్తిన భక్తులు
మేడారానికి పోటెత్తిన భక్తులు

మేడారం జాతరకు ఇంకా రెండు నెలల సమయం ఉండగానే భక్తులు అప్పుడే పోటెత్తుతున్నారు. కరోనా కేసులు పెరిగితే మళ్లీ రాలేమన్న భయంతో తండోపతండాలుగా తరలివస్తున్నారు. వరుస సెలవులు రావడంతో ఆదివారం ఏకంగా లక్ష మంది వనదేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మ దేవతలకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం (బెల్లం) మొక్కులు చెల్లించుకున్నారు. 

అపార జనసందోహం, అరకొర ఏర్పాట్ల కారణంగా మేడారానికి వచ్చిన భక్తులు ఆదివారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాతరకు ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో ఇటీవలే ప్రభుత్వం జాతర నిర్వహణకు రూ.75 కోట్లు కేటాయించింది. టెండర్ల ప్రాసెస్ నడుస్తోంది. ఇంకా పనులేవీ మొదలు కాకపోవడంతో సరైన సౌకర్యాలు లేక భక్తులు అవస్థలు పడ్డారు. 

రద్దీ ఎక్కువగా ఉండటంతో ఓ దశలో దేవతల గద్దెల వద్ద తోపులాట జరిగింది. మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ప్రైవేట్ వెహికిల్స్ కనిపించాయి. కన్నెపల్లి రోడ్డువైపు వాహనాలు పార్క్ చేసుకోవడానికి పోలీసులు అనుమతించడంతో అక్కడి నుంచి గద్దెల వరకూ భక్తులు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు, అకస్మాత్తుగా పెరిగిన రద్దీతో అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు.

నడిరోడ్డుపై యువతి డ్యాన్స్.. ఘటనపై తాజాగా స్పందించిన ఆర్టీసీ ఎండీ

 సజ్జనార్

షార్ట్ వీడియోతో పాప్యులర్ అయిపోవాలనే తపనతో ఇటీవల ఓ యువతి నడిరోడ్డుపై డ్యాన్స్ చేసి నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. యువతి తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న తరుణంలో తాజాగా టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కూడా స్పందించారు. యువతలో ఈ పెడధోరణులు విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 

‘‘నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాప్యులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ.. ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏం ఆనందమో.. ఏమో!?’’ అంటూ ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.