ఫైళ్ల మాయం కేసులో పోలీసుల ముందుకు తలసాని మాజీ ఓఎస్డీ

ఫైళ్ల మాయం కేసులో పోలీసుల ముందుకు తలసాని మాజీ ఓఎస్డీ

ఫైళ్ల మాయం కేసులో పోలీసుల ముందుకు తలసాని మాజీ ఓఎస్డీ

పశుసంవర్థక శాఖలో పలు ఫైళ్లు మాయం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపిస్తున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు. పోలీసులు ఆయనను రాత్రి వరకూ ప్రశ్నించి పలు వివరాలు రాబట్టారు. గత ప్రభుత్వంలో తలసాని పశుసంవర్థక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో కల్యాణ్ ఆయన వద్ద ఓఎస్ డీ గా విధులు నిర్వర్తించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఓఎస్డీ కల్యాణ్ పోస్టు పోయింది.

అయితే, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మూడు రోజులకు కల్యాణ్ తన పాత ఆఫీసుకు వచ్చారు. సాయంత్రం పూట ఆఫీసుకు చేరుకున్న కల్యాణ్.. కొంతమంది ఉద్యోగుల సాయంతో పలు ఫైళ్లను చింపేశారు. చిత్తు కాగితాలను మూటకట్టి తీసుకెళ్లిపోయాడు. ఆఫీస్ వాచ్ మెన్ ఫిర్యాదుతో ఈ నెల 9న ఆయనపై నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. శాఖలో పలు కీలక ఫైళ్లు మాయమయ్యాయని, వాటిని కల్యాణ్ తీసుకెళ్లాడంటూ చార్జిషీట్ దాఖలు చేశారు.

ఈ కేసులో అరెస్టును తప్పించుకునేందుకు కల్యాణ్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విచారణకు రమ్మంటూ పోలీసులు పిలవడంతో సోమవారం నాంపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పోలీసులు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. రాత్రి 9 వరకు కూడా కల్యాణ్ ను ప్రశ్నించినట్లు సమాచారం.

ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మెపై వెనక్కి తగ్గిన జూడాలు

జూనియర్ డాక్టర్లతో (జూడా) రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. ప్రభుత్వం హామీ ఇవ్వడంతో జూడాలు సమ్మెపై వెనక్కి తగ్గారు. వారితో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రతి నెల 15వ తేదీ లోపు స్టైఫండ్ విడుదల చేస్తామని జూడాలకు మంత్రి హామీ ఇచ్చారు. జూడాల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. మంత్రి హామీ ఇవ్వడంతో తాము సమ్మెకు వెళ్ళబోవడం లేదని జూడాలు ప్రకటించారు. రెండు నెలల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేస్తామని మంత్రి దామోదర హామీ ఇచ్చినట్లు జూడాలు వెల్లడించారు. పెరిగిన సీట్లకు అనుగుణంగా హాస్టల్ సదుపాయం కూడా కలిపిస్తామని చెప్పారని చెప్పారు. స్టేట్ వైడ్‌గా డీఎన్‌బీ 46 మంది ఉన్నారని, వారికి స్టైఫండ్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.