టెలికాం, ఓటీటీ సర్వీసులపై ప్రభుత్వం ఆధిపత్యం

టెలికాం, ఓటీటీ సర్వీసులపై ప్రభుత్వం ఆధిపత్యం

టెలికాం, ఓటీటీ సర్వీసులపై ప్రభుత్వం ఆధిపత్యం

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో టెలికమ్యూనికేషన్స్ డ్రాప్ట్ బిల్లు2023ను ప్రవేశపెట్టింది.  ప్రభుత్వం తరపునకేంద్ర  టెలికం, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్  టెలికాం బిల్లును ప్రవేశపెట్టారు.  ఈ బిల్లుతో ఓటీటీ, ఇంటర్నేట్ తో నడిచే కాలింగ్/ మెసేజింగ్ యాప్స్ ను టెలికమ్యూనికేషన్ పరిధిలోకి వస్తాయి.  దేశ భద్రతకు ముప్పు అనిపిస్తే  ఎలాంటి నెట్‌వర్క్ లేదా టెలికమ్యూనికేషన్  సేవలనైనా  ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి లేదా నిలిపివేయడానికి అనుమతి ఉంటుంది.  

టెలికాం రంగాన్ని నియంత్రించే 138 ఏళ్ల భారతీయ టెలిగ్రాఫ్ చట్టాన్ని భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టులోనే   కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారాన్ని అరికట్టాలని కూడా బిల్లు ప్రతిపాదించింది.   దీనిపై పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 

దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని టెలికాం కంపెనీల ప్రవేశ రుసుము, లైసెన్స్ ఫీజు, పెనాల్టీ మొదలైనవాటిని మాఫీ చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టాలనే ప్రపోజల్ కూడా టెలీ కమ్యూనికేషన్స్ బిల్లు-2023 లో ఉంది.