జగన్ సర్కారుపై పవన్ కల్యాణ్ మోదీకి ఫిర్యాదు

జగన్ సర్కారుపై పవన్ కల్యాణ్ మోదీకి ఫిర్యాదు

జగన్ సర్కారుపై  పవన్ కల్యాణ్   మోదీకి ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజలకు నిర్మించి ఇచ్చే ఇళ్ల ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ ఇళ్ల నిర్మాణం, పట్టాల పంపిణీపై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తోందని విమర్శించారు. భూ సేకరణలో వైసీపీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారని, ఇందులో భారీగా అక్రమాలు జరిగాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని పవన్ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. ఐదు పేజీల ఈ లేఖలో జగన్ సర్కారుపై పలు ఆరోపణలు గుప్పించారు.

పేదలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు ప్రభుత్వం రూ.32,141 కోట్ల నిధులను విడుదల చేసిందని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారని చెప్పారు. ఈ క్రమంలోనే భారీ అవినీతికి తెరతీశారని మండిపడ్డారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించలేదని చెప్పారు. మొత్తంగా 6.68 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తవగా.. అందులో కేవలం 86,984 మందికి మాత్రమే అందించారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

  • పవన్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తే మహిళలే జగన్ ను తరిమికొడతారని  

    జనసేన నేత పోతిన మహేశ్ స్పష్టీకరణ

దత్తపుత్రుడు కార్లను మార్చినట్టు భార్యలను మార్చుతాడంటూ సీఎం జగన్ భీమవరంలో చేసిన వ్యాఖ్యలపై జనసేన నేత పోతిన వెంకట మహేశ్ బదులిచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే సీఎం జగన్ మతిభ్రమించినట్టు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో ఏమాత్రం విలువలు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగనే అని విమర్శించారు. దరిద్ర పుత్రుడు, అప్పుల అప్పారావు, చంచల్ గూడ స్టార్, మార్టిగేజ్ స్టార్ అనే పేర్లు జగన్ కు అతికినట్టు సరిపోతాయని పోతిన మహేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. 

మహిళలను ఆటవస్తువులుగా భావించే జగన్... తల్లిని, చెల్లిని ఇంట్లోంచి గెంటేశాడని ఆరోపించారు. పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తే జగన్ ను రాష్ట్రంలోని మహిళలే తరిమికొడతారని స్పష్టం చేశారు.