గూగుల్‌లో మరో 30 వేల మంది ఉద్యోగుల తొలగింపు?

గూగుల్‌లో మరో 30 వేల మంది ఉద్యోగుల తొలగింపు?

గూగుల్‌లో మరో 30 వేల మంది ఉద్యోగుల తొలగింపు?

టెక్ రంగంలో కృత్రిమ మేధకు నానాటికీ ప్రాధాన్యం పెరుగుతోంది. తన కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని పెంచుతున్న గూగుల్ తాజాగా సేల్స్ విభాగం పునర్వ్యవస్థీకరణపై యోచిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం గూగుల్ సేల్స్ విభాగంలో 30 వేల పైచిలుకు మంది ఉద్యోగులు ఉన్నారు. దీంతో, ఉద్యోగాల్లో కోత తప్పదన్న భయం వ్యక్తమవుతోంది. 

వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో యాడ్స్ విధానాన్ని సరళీకృతం చేసేందుకు గూగుల్ మెషీన్ లెర్నింగ్ సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడుతోంది. కొత్త యాడ్స్‌ సృష్టిలో ఏఐ సాంకేతికతను ప్రవేశపెట్టి ఆదాయం పెంచుకుంటోంది. ఈ సాంకేతికత మంచి సామర్థ్యంతో పనిచేయడం, ఉద్యోగుల అవసరం తగ్గడంతో గూగుల్ లాభాల మార్జిన్లు పెరుగుతున్నాయి. 

గూగుల్‌లో ఏఐ వినియోగం పెరిగేకొద్దీ ఉద్యోగాల్లో కోతలు మొదలవుతాయని ది ఇన్ఫర్మేషన్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం గూగుల్ వినియోగిస్తున్న పర్ఫార్మెన్స్ మ్యాక్స్ యాడ్ టూల్‌.. ప్రకటనల రూపకల్పన, ప్లేస్‌మెంట్ వంటి విషయాల్లో అడ్వటైజర్లకు సహకరిస్తోంది. అనేక విషయాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంది. అప్పటికప్పుడు రియల్ టైంలో యాడ్లలో మార్పులు చేస్తూ ప్రకటనల ప్రభావశీలతను ఈ టెక్నాలజీ పెంచుతోంది. ఫలితంగా ఉద్యోగుల అవసరం తగ్గుతుండటంతో లేఆఫ్స్ భయాలు మొదలయ్యాయి.

పేటీఎంలో మరోసారి ఉద్యోగాల కోత.

ప్రముఖ స్టార్టప్ కంపెనీ పేటీఎం మరోమారు ఉద్యోగుల తొలగింపు చేపడుతోందని ప్రచారం జరుగుతోంది. ఈసారి దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను ఇంటికి పంపించిందని, మరింత మందిని సాగనంపే ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. ఖర్చుల నియంత్రణ, పునర్వవస్థీకరణ పేరుతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లో ఈ తొలగింపులు జరుగుతాయని అనధికారిక సమాచారం.

ఈ ఏడాది మన దేశంలోని స్టార్టప్ కంపెనీలకు పెద్దగా కలిసిరాలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వివిధ స్టార్టప్ కంపెనీలు ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాలలో ఏకంగా 28 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. గతేడాది ఈ సంఖ్య 20 వేలు ఉండగా.. 2021 లో 4 వేల మంది ఉద్యోగులు తమ జాబ్ కోల్పోయారు. ఫిన్ టెక్ రంగంలో ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపు విషయానికి వస్తే పేటీఎం టాప్ లో ఉంది. సంస్థ వర్క్ ఫోర్స్ లో దాదాపు 10 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగుల తొలగింపు ప్రభావం స్టాక్ మార్కెట్ పైనా పడింది. పేటీఎం షేర్ల వాల్యూ దాదాపు 28 శాతం పడిపోయింది. గడిచిన ఆరు నెలల్లో పేటీఎం షేర్ ధర 23 శాతానికి పైగా తగ్గింది.