230 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ .. 91 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

230 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ .. 91 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

230 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్  .. 91 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 230 పాయింట్లు లాభపడి 71,337కి చేరుకుంది. నిఫ్టీ 91 పాయింట్లు పెరిగి 21,441 వద్ద స్థిరపడింది. ఉదయం మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయినప్పటికీ.. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాల బాట పట్టాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (2.44%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.65%), విప్రో (1.59%), కోటక్ బ్యాంక్ (1.35%), టాటా స్టీల్ (1.27%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-1.81%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.42%), ఇన్ఫోసిస్ (-1.12%), టీసీఎస్ (-0.80%), టాటా మోటార్స్ (-0.68%).