మేడిగడ్డ డ్యామ్ పూర్తి వివరాలు ఇవ్వండి: హైకోర్టు ఆదేశం

మేడిగడ్డ డ్యామ్ పూర్తి వివరాలు ఇవ్వండి: హైకోర్టు ఆదేశం

మేడిగడ్డ డ్యామ్ పూర్తి వివరాలు ఇవ్వండి: హైకోర్టు ఆదేశం

మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ నేత నిరంజన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. మహాదేవపురం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. చీఫ్ సెక్రటరీ నుంచి సమాచారం తీసుకుని తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై ఎల్ అండ్ టీ డైరెక్టర్ పై ఉత్తమ్ ఆగ్రహం

కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ పనులను నాసిరకంగా చేపట్టారని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బ్యారేజీని నిర్మించిన ఎల్ అండ్ టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వీ దేశాయ్ తో పాటు ఆ సంస్థ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ... నాణ్యత లేకుండా పనులు ఎలా చేస్తారని మండిపడ్డారు. రిపేర్లతో తమకు సంబంధం లేదని ఏదో ఒక లెటర్ రాసి తప్పించుకోవాలని చూడొద్దని.... ప్రజాధనాన్ని వృథా చేసి బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కారణమైన ఏ ఒక్కరినీ తాము వదిలి పెట్టబోమని హెచ్చరించారు. బ్యారేజీని రిపేర్ చేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థదేనని తేల్చి చెప్పారు. 

బ్యారేజీ పరిస్థితిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నివేదిక అందిన తర్వాత పూర్తి స్థాయిలో బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేపట్టాలని.. ఆ బాధ్యత మొత్తం ఎల్ అండ్ టీదే అని చెప్పారు. తప్పు చేసినవాళ్లు తప్పించుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించిన సంస్థలతో కూడా సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ పై అసెంబ్లీలో ప్రజంటేషన్ ఇచ్చేందుకు పూర్తి వివరాలను అందించాలని చెప్పారు.