పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్న బీజేపీ అగ్రనేత అమిత్ షా

పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్న బీజేపీ అగ్రనేత అమిత్ షా

పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్న బీజేపీ అగ్రనేత అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా గురువారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో బీజేపీ ముఖ్య నాయకులతో అమిత్ షా సమావేశం కానున్నారు.

ఆ తర్వాత పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ హ్యాట్రిక్ విజయాన్ని కాంక్షిస్తూ... తెలంగాణ ప్రజల యోగక్షేమాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి... అమ్మవారి ఆశీర్వాదం తీసుకోనున్నారు. అనంతరం బీజేపీ మండలాధ్యక్షులతో సమావేశం కానున్నారు.

దరఖాస్తులు జిరాక్స్ తీసుకోమంటున్నారు: ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం

ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు కోసం ఫామ్స్ ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో భాగంగా నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ, వార్డు సభలను ఏర్పాటు చేసి ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.

ఈ క్రమంలో తన నియోజకవర్గంలో అభయ హస్తం - ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా గోషామహల్, మంగళహాట్ డివిజన్‌లను ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాపాలన ఏర్పాట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డు కార్యాలయాల్లో ప్రజలకు దరఖాస్తు ఫామ్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జిరాక్స్ తీసుకోవాలని... లేదంటే ఒక్కో దరఖాస్తు ఫామ్‌కు డబ్బులు చెల్లించాలని ప్రజలను డిమాండ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.