తెలంగాణలో చలికి వణుకుతున్న ప్రజలు.. పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

తెలంగాణలో చలికి వణుకుతున్న ప్రజలు.. పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

తెలంగాణలో చలికి వణుకుతున్న ప్రజలు.. పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. బుధవారం రాత్రి రాష్ట్రంలో 19 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 10 నుంచి 15 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లోని జైనథ్‌లో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్‌లో 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  

ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే చలి తీవ్రత అధికంగా ఉంది. ఇక్కడి అన్ని జిల్లాల్లో అల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యయి. రాబోయే మూడు రోజుల్లో చలి తీవ్రత ఉంటుందనీ, ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ రిపోర్టులో తేలింది. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పిల్లలు, వృద్ధులు, గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్... 

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ చలాన్లపై భారీగా డిస్కౌంట్‌ను ప్రకటించింది. 2  కోట్ల‌కు పైగా పెండింగ్ చ‌లాన్లు ఉండ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వం రాయితీ క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల‌పై 90 శాతం రాయితీ; టూ వీల‌ర్స్‌పై 80 శాతం; ఆటోలు, ఫోర్ వీల‌ర్‌పై 60 శాతం; భారీ వాహ‌నాల‌పై 50 శాతం రాయితీ లేదా తగ్గింపును ఇచ్చినట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ నెల 26వ తేదీ నుంచి 2024 జనవరి 10వ తేదీ వరకు వాహ‌న‌దారులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవడానికి గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. 45 రోజుల వ్యవధిలో రూ.300 కోట్ల వరకు వసూలు అయ్యాయి. దాదాపు 65 శాతం చలాన్లు చెల్లించారు. అయితే ఆ తర్వాత మళ్లీ పెండింగ్ చలాన్లు పెరిగిపోతున్నాయి. గత నెలాఖరున చలాన్ల సంఖ్య మళ్లీ 2 కోట్లను దాటింది. దీంతో ప్రభుత్వం మరోసారి రాయితీని ప్రకటించింది.