కాంగ్రెస్ లో పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై షర్మిల చర్చ

కాంగ్రెస్ లో పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై షర్మిల చర్చ

కాంగ్రెస్ లో పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై షర్మిల  చర్చ

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఎల్లుండి ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలను ఆమెకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ లో పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణ తదితర కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 

ఇక ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మధ్నాహ్నం 3 గంటలకు షర్మిల ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడపకు వెళ్లనున్నారు. కడప విమానాశ్రయం నుంచి ఆమె ఇడుపులపాయకు చేరుకుంటారు. తన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద నివాళి అర్పిస్తారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహం సందర్భంగా తండ్రి ఆశీర్వాదం తీసుకుంటారు. కాబోయే వధూవరులు రాజారెడ్డి, ప్రియ కూడా షర్మిలతో పాటు ఇడుపులపాయకు వెళ్లనున్నారు.

 మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యలపై షర్మిల స్పందన

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో కీలక ఘట్టం నమోదు కాబోతోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు లాంఛనమే! ఆమె తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్ధమవుతున్నారు! 

కాగా, ఇటీవల వైసీపీ అధినాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి... తన రాజకీయ ప్రస్థానం వైఎస్ షర్మిలతోనే అని ఇటీవల ప్రకటించారు. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం అంటూ జరిగితే, తాను కూడా ఆమె వెంట కాంగ్రెస్ లోకి వెళతానని వివరించారు. 

ఆర్కే వ్యాఖ్యలపై మీడియా షర్మిలను ప్రశ్నించింది. అందుకామె స్పందిస్తూ... తన పట్ల, వైఎస్సార్ కుటుంబం పట్ల అభిమానం ప్రదర్శించినందుకు ఆర్కేకు ధన్యవాదాలు తెలిపారు. 

కాగా, తన రాజకీయ భవిష్యత్తుపై రెండ్రోజుల్లో స్పష్టతనిస్తానని షర్మిల తెలిపారు. ఇవాళ ఆమె వైఎస్సార్టీపీ ముఖ్యనేతలతో లోటస్ పాండ్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది. తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్టు ఆమె వారితో చెప్పినట్టు తెలిసింది.

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేరబోతున్నారనే వార్తల్లో పూర్తి క్లారిటీ వచ్చింది. ఈరోజు లోటస్ పాండ్ లోని కార్యాలయంలో పార్టీ కీలక నేతలతో షర్మిల భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్సార్టీపీ ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... గురువారం నాడు కాంగ్రెస్ లో షర్మిల చేరుతున్నారని చెప్పారు. ఆమెకు ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని అన్నారు. పార్టీలోని నేతలకు కూడా పదవులు వస్తాయని చెప్పారు. 

మరోవైపు, ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పజెప్పనున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కూడా షర్మిలతో కలిసి నడుస్తానని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.