అలనాటి గాయకుడు మాధవపెద్ది సత్యం.. ఆయన గురించి ప్రస్తావించిన తనయుడు

అలనాటి గాయకుడు మాధవపెద్ది సత్యం.. ఆయన గురించి ప్రస్తావించిన తనయుడు

అలనాటి గాయకుడు మాధవపెద్ది సత్యం..  ఆయన గురించి ప్రస్తావించిన తనయుడు
అలనాటి గాయకుడు మాధవపెద్ది సత్యం..  ఆయన గురించి ప్రస్తావించిన తనయుడు

'వివాహ భోజనంబు .. వింతైన వంటకంబు' అనే పాట ఈ రోజుకీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. ఆ పాట పాడినవారు మాధవపెద్ది సత్యం. అప్పట్లో ఎస్వీ  రంగారావుకి ఆయనే పాటలు .. పద్యాలు పాడేవారు. తాజా ఇంటర్వ్యూలో మాధవపెద్ది సత్యం గురించి, ఆయన తనయుడు వెంకటనారాయణమూర్తి మాట్లాడారు. 

"మా నాన్నగారి ఊరు గుంటూరు జిల్లాలోని 'బ్రాహ్మణ కోడూరు'. వాళ్లు 11 మంది సంతానం. నాకు ఊహ తెలిసిన తరువాత ఏడుగురు మాత్రం ఉండేవారు. మా పెదనాన్నగారి పిల్లలే మాధవపెద్ది రమేశ్ - సురేశ్. మా నాన్నగారికి మా అక్కయ్య .. నేను ఇద్దరమే. అప్పట్లో నాన్నగారు సినిమా పాటలతో .. నాటకాలతో బిజీగా ఉండేవారు. మా అమ్మగారి పేరు ప్రభావతి. వారి వివాహం 1951లో జరిగింది. 

మా నాన్నగారి తరపు బంధువులే ఎస్. జానకి గారు. ఆమె కూడా ఆ పెళ్లికి వచ్చారు. అప్పుడు ఆమె వయసు 11 ఏళ్లు. నాన్నగారికి ఎంత పేరు వచ్చినా చాలా సింపుల్ గా ఉండేవారు. ఆడంబరాలు ఆయనకి నచ్చేవి కాదు. బహుశా లుంగీ - జుబ్బాపై రికార్డింగ్ థియేటర్ కి వెళ్లి పాడింది మా నాన్నగారు ఒక్కరే కావొచ్చు. ఎక్కడికైనా వెళ్లాలంటే సైకిల్ పైనే వెళ్లేవారు" అని చెప్పారు.

'ఆహుతి' ప్రసాద్ తనయుడు కార్తీక్ ప్రసాద్

'ఆహుతి' ప్రసాద్ .. తెలుగు తెరపై విలక్షణ నటుడిగా తన మార్క్ చూపించిన నటుడు. సుదీర్ఘకాలం పాటు అనేక చిత్రాలలో నటించిన ఆయన, ఆ తరువాత కాలంలో కేన్సర్ తో చనిపోయారు. ఆయన తనయుడు కార్తీక్ ప్రసాద్ నటుడిగా ఎదుగుతున్నాడు. తాజాగా 'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ ప్రసాద్ మాట్లాడాడు.

"నాన్న కేన్సర్ తో పోయారు .. ఆయనకి కేన్సర్ వచ్చిన విషయం కూడా చాలా కాలం పాటు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వేషాలు రావడం కష్టం. కొంతమంది సానుభూతిని చూపించినా, మరికొంతమంది చులకనగా చూస్తారు. అలా చూడటం నాన్నకి ఇష్టం ఉండదు. అందువలన ఆయన తన పనిని తాను అలా చేస్తూనే వెళ్లారు" అని అన్నాడు. 

"చివరి రోజుల్లో నాన్న సొంత ఊరుకి వెళ్లాలనుకున్నారు. అక్కడ ఇంటిని కూడా బాగు చేయించాము. అంతలోనే ఆయన పోయారు. అందరితో కలివిడిగా ఉండటం వలన, ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చారు. ఇక నా విషయానికి వస్తే, నేను పైలెట్ గా కొంతకాలం పనిచేశాను. ఆ తరువాతనే సినిమాల దిశగా వచ్చాను. 'టక్ జగదీశ్' .. 'మసూద' వంటి సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి" అని చెప్పాడు.